ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
78 Views

వికారాబాద్:జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటివరకు జిల్లాకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.ప్రజావాణి సమావేశం హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ రెవిన్యూ లింగ్యా నాయక్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సుధీర్ ల తో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో ఇప్పటివరకు ప్రజావాణి లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు.ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల ప్రజల నుండి (131) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.అందులో రెవిన్యూ శాఖ జిల్లా విద్యాశాఖ, మున్సిపాలిటీ, ఎంప్లాయిమెంట్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్, లీడ్ బ్యాంకు, ఏడి లాండ్ అండ్ సర్వే, నుండి ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వాసు చంద్ర, జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.