ప్రిన్సిపాల్ ను విధుల నుండి తొలగించాలి: ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వై గీత

0
19 Views

కుర్క చర్ల: కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల లో పనిచేస్తున్న సుజాత ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్ ను విధుల నుండి తొలగించి చట్టపరమని చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వై గీత ‘ పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి అన్నారు. శనివారం ఐ ఎఫ్ టి యు’ పి డి ఎస్ యు జిల్లా కమిటీ లా ఆధ్వర్యంలో సుజాత కుటుంబాన్ని సందర్శించి పరామర్శించి అనంతరం హాస్టల్ సందర్శించి వర్కర్స్ తో మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వై గీత ‘ పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ ఇంట్లో ఆయన వ్యక్తిగత పనులు చేయించుకొని మానసికంగా వేధింపుల గురి చేస్తూ తనకు అనుకూలంగా వ్యవహరించ నందుకు ఉద్యోగం నుండి తీసివేసి మూడు నెలల నుండి మానసికక్షోభకు గురి చేయడం జరిగింది కావున ప్రిన్సిపల్ పైన కఠినమైన చర్యలు తీసుకొని సుజాత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రాములు పాల్గొనడం జరిగింది.