ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
143 Views

వికారాబాద్: ప్రజల నుండి వచ్చిన ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎపటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి కార్యక్రమమ లో జిల్లా కలెక్టర్ పాల్గొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సుమారు 150 ప్రజా పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ప్రజా పిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే ప్రరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ధరణి, భూ సర్వే , ఆసరా పెన్షన్ ల కు సంబంధించిన దరకస్తులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. వివిధ మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన పిర్యాదులను పరిశీలించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. సమస్యలకు సంబంధించిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ , ఇంచార్జ్ అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డిఓ వాసు చంద్ర ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.