ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
48 Views

వికారాబాద్: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కల్లెక్ట్రేట్ సమావేశము హాలు నందు నిర్వహించిన ప్రజావాణికార్యక్రమం లో ప్రధానంగా విద్య,వైద్య, బిసి,గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, భూ సర్వే తదితర అంశాలకు సంబంధించి 84 ఫిర్యాదులు వచ్చాయని,అట్టి ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ క్షుణ్ణంగా పరిశించి పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ , ట్రిని కలెక్టర్ ఉమా హారతి , ఆర్ డి ఓ వాసు చంద్ర,వివిధ శాఖ ల జిల్లా స్థాయి అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.