29న ఉద్యోగులకు క్రీడా పోటీలు:జిల్లా యువజన క్రీడాలాధికారి హన్మంత్ రావు

0
75 Views

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా యువజన, క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో, మేజర్ ధ్యాన్ చాంద్ జన్మదినం పురస్కరించుకుని జాతీయ క్రీడ దినోత్సవం 29 ఆగస్టు 2024న ఉదయం 9.00 గంటలకు పరిగి ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడాలాధికారి హన్మంత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించబడతాయి. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 28 సాయంత్రం 05:00 గంటలలోగా తమ పేర్లను 9676638201 నంబర్‌కు వాట్సాప్ ద్వారా నమోదు చేయగలరు. మహిళలకు వాక్ 50 మీటర్లు (50 ఏళ్లకు పైబడినవారు), రన్ 100 మీటర్లు (50 ఏళ్లలోపు), నిమ్మకాయ-స్పూన్ పోటీ,, షాట్ పుట్,, చెస్, బ్యాడ్మింటన్ (డబల్స్)
, టేబుల్ టెన్నిస్ అదే విధంగా పురుషులకు వాక్ 50 మీటర్లు (50 ఏళ్లకు పైబడినవారు), రన్ 100 మీటర్లు (50 ఏళ్లలోపు), వాలీబాల్ (సింగిల్ టీం) బ్యాడ్మింటన్ (డబల్స్),. ఖో ఖో (సింగిల్ టీం), చెస్
టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయన్నారు.