తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ను కలిసిన డిగ్రీ గెస్ట్ అధ్యాపక బృందం

0
17 Views

వికారాబాద్: వికారాబాద్ గెస్ట్ లెక్చర్స్ గా పని చేస్తున్న తమకు ఆటో రెన్యువల్ తో పాటు సర్వీస్ కంటిన్యూ చేసి పీరియడ్ విధానాన్ని రద్దు చేసి 12 నెలలకు కన్సాలిడేట్ పే ఇవ్వాలని వికారాబాద్ డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపక బృందం తెలంగాణ శాసనసభ స్పీకర్    గడ్డం ప్రసాద్ కుమార్  ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గెస్ట్ లెక్చర్లకు 50 వేల రూపాయలు వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అంతేకాకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ గెస్ట్ అధ్యాపక ప్రెసిడెంట్ K. కృష్ణ , అధ్యాపకులు కే ప్రభు ‘కిషన్ రావు; ఎం సుజాత;ఎస్ శ్వేత;పీ స్వప్న; ఎస్ మహేశ్వరి; బి కృష్ణయ్యలు పాల్గొన్నారు .