వికారాబాద్ బ్రిడ్జీ మరమ్మతులకు లైన్ క్లియర్ , ఎంపీ నివాసంలో చర్చలు సఫలం

0
16 Views

వికారాబాద్: వికారాబాద్ రైల్వే బ్రిడ్జీ మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 12 కోట్లు మంజూరైన విషయం వికారాబాద్ పట్టణ ప్రజలకు  తెలిసిందే. ఈ క్రమంలోనే అట్టి బ్రిడ్జును మూలమాలుపులు కాకుండా స్టేట్ గా చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆలోచన చేయడంతో కొంత ఆలస్యమవుతూ వస్తుంది. మెథడిస్ట్ వారూ సానుకూలంగా లేకపోవడంతో సోమవారం బిషప్ నివాసంలో ఎమ్మెల్యే వారితో చర్చలు జరిపారు. దీనికి  వికారాబాద్ రైల్వే బ్రిడ్జి మరమ్మతులపై బిషప్ ఏం, ఏ డేనియల్  తో చర్చలు సఫలం అయ్యారు. వికారాబాద్ పట్టణంలోని రైల్వే బ్రిడ్జి ని వంతెనను స్ట్రేటనింగ్ చేసే విషయమై సోమవారం బిషప్ ఎం ఏ డేనియల్   నివాసంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి లు చర్చలు జరుపగా అందుకు బిషప్ సానుకూలంగా స్పందించారు.