కోట మర్పల్లిలో దారుణం అనుమానస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య

0
13 Views

వికారాబాద్(కోట్ పల్లి): అనుమానస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోట మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రావులపల్లి గ్రామానికి చెందిన రత్మమ్మ(33)ను గత తొమ్మిది సంవత్సరాల క్రితం కోట మర్పల్లి గ్రామానికి చెందిన సుభాష్ తో వివాహం జరిపించారు. గత కొంత కాలంగా అత్తింటి వేదింపులు పెరగడంతో పలు సందర్బాల్లో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్థి చెప్పిన తీరు మార లేదు. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి రత్నమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని అత్తమామ హత్య చేశారని రత్నమ్మ తల్లి తండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునిి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించి అత్త మామ భర్తను పోలీీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.