ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ నెల 11న కవితను విచారించనున్న సీబీఐ

0
27 Views

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11వ తేదీన విచారించేందుకు సీబీఐ అంగీకారం తెలిపింది. ఆ రోజున అందుబాటులో ఉండాలని సీబీఐ ఈ మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చింది. కాగా, మద్యం కుంభకోణంలో డిసెంబర్ 6వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందింగా సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖకు స్పందించిన కవిత.. ఈ నెల 6వ తేదీన తనకు వ్యక్తిగత పనులు ఉండటంతో కలవడం కుదరని సీబీఐకు లేఖ రాసింది. డిసెంబర్ 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తాను అందుబాటులో ఉంటానని కవిత లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖకు సీబీఐ అధికారులు ఈ మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారు. కవిత కోరినట్లుగా డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసేందుకు సీబీఐ అంగీకరించింది.