వికారాబాద్ (బంట్వారం): తూకం కంటా వద్ద జరిగిన ఘటనతో ఏకంగా 50 మందిి ఇద్దరిపై దాడి చేసి గాయ పర్చిన సంఘటన వికారాబాద్ జిల్లా బంటారం మండలం బొపనారం గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామానికి చెందిన రహీమ్ టిప్పర్ లారీ ని బొప్పునారం కు చెందిన బ్యాగరి యెషఫ్, సాయిలు, భాస్కర్ లు తమ పొలం లో మట్టి పనినిమిత్తం కిరాయికి రప్పించారు. గ్రామం నుండి వారి పొలానికి వెళ్లే మార్గంలో మర్పల్లి కిష్టారెడ్డి కి చెందిన వ్యవసాయ భావివద్ద చెరుకు పంట తూకం వేసే కంటా ఉంది. ఈ కంటా పైనుండి టిప్పర్ లారీ వెళ్లడంతో బరువుకు అది ధ్వంసం అయ్యింది. ఈ విషయమై ప్రభాకర్ రెడ్డి టిప్పర్ ఓనర్ రహీమ్ తో ఫోన్ లో మాట్లాడి కంటా బాగుచేసి టిప్పర్ లారిని తీసుకుపోమని చెప్పాడు. ఇంతలోనే బంగరి యెషప్, సాయులు, భాస్కర్ తమతోపాటు 50 మందిని వెంటపెట్టుకొని కర్రలు, చాకులు, రాళ్లతో ప్రభార్ రెడ్డి, వెంకట్ రెడ్డి లఫై దారిమధ్యలో అడ్డగించి విచక్షణ రహితంగా దాడి చేశారు. పొలంగట్ల విషయంలో ఇటీవలే గొడవ జరిగింది.రంగారెడ్డి జిల్లా లో వంద మంది కలిసి చేసిన దాడిని మరువక ముందే 24 గంటల్లో మరో మూక దాడి జరగడం ఆందోళన కల్గిస్తున్న అంశమని గ్రామస్థులు భయందోళన లు వ్యక్తం చేస్తున్నారు.
17 Views