మీతో నేను కార్యక్రమంలో ఎమ్మెల్యే ను ప్రశ్నించిన కుక్కింది యువకులు

0
24 Views

వికారాబాద్: నీతో నేను కార్యక్రమంలో భాగంగా దారులు మండలం కుక్కింద గ్రామంలో పర్యటించిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు నిరసన సెగ తగిలింది. గ్రామానికి చెందిన వాల్మీకి యూత్ సభ్యుడు సుధాకర్ ప్రశ్నించారు. గ్రామంలో బాత్రూంలో నిర్మించుకున్న వారికి బిల్లులు రాలేదని బాత్రూంలు నిర్మించుకొని వారికి బిల్లులు వచ్చాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అదేవిధంగా స్థానిక ఎంపిటిసి కి సమాచారం అందలేదని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ అనే వ్యత్యాసం చూపుతున్నారని ఊరిలో పారిశుద్ధ సమస్య తలెత్తిందని ఎక్కడ చెత్త అక్కడ ఉంటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బదులిచ్చారు.