రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి భారీ మెజారిటీ అందిస్తాం :వికారాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్

0
16 Views

వికారాబాద్:రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి భారీ మెజారిటీ అందిస్తామని వికారాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ అన్నారు. బుదవారం వికారాబాద్ లోని  తెలంగాణ శాసనసభాపతిగడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో వికారాబాద్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన వ్యూహన్ని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అనుసరిస్తామని , బిజెపి ,బీఆర్ఎస్ కు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో డిపాజిట్లు రాకుండా చేస్తామని గత పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ అందించామని.. ఈ సారి దానికి మించి మెజారిటీ ఇస్తామని దీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ , యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ.కృష్ణంరాజు  మాట్లాడుతూ.. త్వరలో యువజన కాంగ్రెస్ ప్రక్షాళన జరుగుతుందని కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇస్తామని త్వరలో కమిటీలన్నీ పూర్తి చేయాలని అదేవిదంగా జిల్లా యువజన కాంగ్రెస్ తరపున త్వరలో పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని ఆహ్వానిస్తున్నమని,ప్రతి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జెండాను ఎగర వేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు  పట్లోళ్ల.సతీష్ రెడ్డి, వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస్ ముదిరాజ్ ,
రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నిఖిల్ రెడ్డి ,జిల్లా కార్యదర్శి హరీష్ రెడ్డి ,  యువజన కాంగ్రెస్ వివిధ మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.