అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి

0
85 Views

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, రేషన్ కార్డుల జారీకి సంబంధించి కొత్త విధివిధానాలు రూపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నూతన ప్రక్రియ ద్వారా రేషన్ కార్డు జారీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబం కొత్త రేషన్ కార్డులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.