జడ్పి నిర్మాణ పనుల్లో వేగం పెంచండి:ఇంజినీర్లకు జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి ఆదేశం

0
17 Views

వికారాబాద్: ఫిబ్రవరి చివరిలోగా జడ్పి నూతన భవనం నిర్మాణం పూర్తి అయ్యేలా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అధికారులకు ఆదేశించారు. బుదవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 10 కోట్లతో నిర్మిస్తున్న జడ్పి భవన నిర్మాణ పనులపై జడ్పిలో పీఆర్ ఇంజినీర్లతో సమీక్షించారు. ఫిబ్రవరి చివరిలో వందశాతం పనులు పూర్తికావాలని సూచించారు. అలాగే జిల్లాలో మంజూరైన అంగన్వాడీ, డ్వాక్రా భవనాల నిర్మాణాలు కూడా త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జడ్పి అతిథి గృహాల నిర్మాణాలు పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత కాలవ్యవదిలో పూర్తి చేయాలన్నారు. పాత ఎంపీడీఓ కార్యాలయాల మరమ్మతులు కూడా కంప్లీట్ చేయాలని ఇది వరకే సూచించామని గుర్తు చేశారు. పనుల్లో నాణ్యత పాటించకుంటే గుత్తేదార్లపై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రంలో జడ్పి సీఈఓ జానకీరెడ్డి, డిప్యూటీ సీఈఓ శుభాషిణి, పీఆర్ ఈఈ ఉమేష్, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ బాబు, డీఈఈలు పాల్గొన్నారు.