వికారాబాద్ లో దారుణం … మహిళ అత్యాచారం హత్య

0
18 Views

వికారాబాద్ : గుర్తు తెలియని మహిళను అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ మండలం పులుమద్ది అడవి ప్రాంతంలో గుర్తు తెలియని మహిళా(30) మృతి చెంది ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహంను గుర్తు తెలియని దుండగులు  పెట్రోల్ తో నిప్పంటించడంతో గుర్తు పట్టనట్లుగా ఉండడంతో పోలీసులు క్లూస్ టీమ్ తో జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.