మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ పరమేశ్వర్

0
272 Views

వికారాబాద్ (బంట్వారం): బంట్వారం మండల పరిధి సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన జి.మహేశ్వరి రెండు కిడ్నీల సమస్యతో చికిత్స పొందుతున్న మహేశ్వరి ఆర్ధిక సహాయం కోసం వేచి చూడగా బంట్వారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పరమేశ్వర్ శుక్రవారం హైదరాబాద్ లోని బీరంగూడ లోని శ్రీ వేద హాస్పిటల్ కు వెళ్లి ఆమెని పరామర్శించి తన వంతుసాయంగా రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె కుటుంబానికి వికారాబాద్ జిల్లా ప్రజలు, మండల ప్రజలు వారికి తోచిన సహాయం అందించాలని ఆయన కోరారు.