ఈనెల 20, 21 వ తేదీలలో ఓటురుగా నమోదుకు స్పెషల్ క్యాంపైన్ డే:జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి

0
19 Views

వికారాబాద్:01 జనవరి, 2024 నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకున్న వారందరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 20, 21 వ తేదీలలో (శనివారం, ఆదివారం) న స్పెషల్ క్యాంపైన్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జనవరి, 01 2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులు అందరు తప్పకుండ తమ పేర్లను ఓటురుగా నమోదు చేసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాలలో ముసాయిదా ఓటరు జాబితా మరియు సంబంధిత ఫారాలు 6,7,8 లను ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటారన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదుతో పాటు సవరణలు, చిరునామా మార్పులు చేర్పులతో పాటు ఇతర క్లెయిములు, అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి   తెలియజేశారు.