గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
22 Views

వికారాబాద్:ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శకటాలు, స్టాల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు అందించే అసెట్స్ పంపిణీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారంగా అందరినీ ఆహ్వానించాలని సూచించారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసేందుకు జాబితాను అందజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.