కోటక్ మహేంద్ర బ్యాంక్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
18 Views

వికారాబాద్: రైతులకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోటక్ మహేంద్ర బ్యాంక్ అధికారులకు సూచించారు.బుధవారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో కొటక్ మహేంద్ర బ్యాంక్ నూతన బ్రాంచ్ ను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ… వికారాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి రైతులను ప్రోత్సహించే విధంగా బ్యాంకర్ల సేవలు ఉండాలన్నారు. అదేవిధంగా జిల్లాలో చిన్న చిన్న పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించే విధంగా తమ బ్యాంకు పని చేయాలని కలెక్టర్ తెలిపారు. కోటక్ మహేంద్ర బ్యాంక్ ప్రారంభోత్సవంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి బాబు మోజెస్ , రీజినల్ బిజినెస్ హెడ్ నటరాజ్ డోకే, క్లస్టర్ ఏరియా మేనేజర్ అనిల్ పరిమి, జనరల్ మేనేజర్ రాఘవేంద్ర గౌడ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.