పిబ్రవరి నెలలో వికారాబాద్ రానున్న మోడీ

0
20 Views

వికారాబాద్:ఫిబ్రవరి 15 లేదా 20వ తేదీలలో వికారాబాద్ కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారని మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం కొండా బాలకృష్ణ గార్డెన్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేస్తున్న సదానందారెడ్డి కార్యక్రమానికి హాజరై వీడ్కోలు పలికారు. అదే విధంగా అయోధ్య నుంచి తీసుకొచ్చిన ప్రసాదాన్ని నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మూడో సారి నరేంద్రమోడీ దేశ ప్రధాని కాబోతున్నారని, రాష్ట్రంలో కూడా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి తప్పని సరిగా చేవెళ్లలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, నాయకులు నవీన్ , పాండు గౌడ్, సుచరిత, రాజు తదితరులు పాల్గొన్నారు.