ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ల మొదటి స్థాయి పరిశీలన క్షుణ్ణంగా చేపట్టాలి: వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
18 Views

వికారాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ల మొదటి స్థాయి పరిశీలన క్షుణ్ణంగా చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు.బుధవారం అదురనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీవో విజయ్ కుమారి లతో కలిసి పట్టణంలోని ఈవీఎం గిడ్డంగి, మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈవీఎంల మొదటి విడత పరిశీలన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం 5వ తేదీ నుండి మొదలయ్యి ఈనెల 14 వరకు ఫస్ట్ లేవల్ చెకప్ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును ప్రాథమికంగా పరిశీలన జరిపేందుకు ఈసిఐఎల్ కు చెందిన 12 మంది సాంకేతిక నిపుణుల బృందం ఈవీఎంల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు.