తీరిన కోరిక… మొదలైన రోడ్డు పనులు

0
16 Views

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ ప్రజల చీరకాల కొరిక అయినా స్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం ఎట్టకేలకు తీరిందని మాజీ కౌన్సిలర్ బొండల శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఇందిరా
నగర్ నుంచి స్మశాన వాటికకు వెళ్లే దారిని జేసీబీతో పెట్టి చదును చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గతంలో నుంచి రైల్వే అధికారుల వల్ల సమస్య అలాగే ఉండిపోయిందని, ప్రస్తుత స్పీకర్ గ
డ్డం ప్రసాద్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ సహకారంతో ఈ రోడ్డు పనులు ముందుకు సాగాయన్నారు. కాలనీ వాసులు కౌన్సిలర్ బొండల సువర్ణ, శ్రీని
వాస్ గౌడ్ తో కలిసి ఈ రోడ్డు పనులు చేయించడం జరుగుతుందన్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రోడ్డు సమస్య తీరిందని సంతోషం వ్యక్తం చేశారు.