మార్కాండేయ మహర్షి జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి

0
18 Views

వికారాబాద్, ఫిబ్రవరి 12:వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్ట శ్రీ అనంతపద్మనాభ స్వామి సన్నిదిలో వెలిసిన మార్కాండేయ మహర్షి జయంతి ఉత్సవాలు సోమవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు స్వామి వారిని మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజులరమేష్ కుమార్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కిషన్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ తదితరులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.