రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్

0
17 Views

మేడ్చల్ : రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చెక్కారు ఓ అవినీతి అధికారు. శామిర్ పేట తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న తొడేటి సత్యనారాయణ  ఓ పని నిమిత్తం మొవ్వా రామ శేషగిరి రావు వద్ద రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. అట్టి డబ్బును తహసీల్దార్ డ్రైవర్ భద్రికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రైవర్ ను విచారించగా తహసీల్దార్ ఆదేశాల మేరకు డబ్బులు తీసుకోవడం జరిగిందని ఒప్పుకున్నాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.