టెట్ అభ్యర్థులపై భారం తగ్గించాలి:ప్రశు రాథోడ్ సేవాలాల్ సేనా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి

0
23 Views

వికారాబాద్:టెట్ అభ్యర్థులపై భారం తగ్గించాలని టెట్ కోసం  సిద్దమవుతున్న అభ్యర్థులపై ఆర్థిక, ప్రయాణ భారాలను తగ్గించాలని సేవాలాల్ సేనా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశు రాథోడ్ డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం టెట్ అభ్యర్థులపై నోటిఫికేషన్ లో రూ. 1000, రెండు పేపర్ లకు రూ. 2వేలను నిర్ణయించడం సరైంది కాదన్నారు. అదేవిధంగా 33 జిల్లాల అభ్యర్ధుల కోసం రాష్ట్రంలోని 11 జిల్లాలో మాత్రమే పరీక్షలు
నిర్వహించడం వల్ల వివిధ ప్రాంతాల అభ్యర్థులకు ప్రయాణ భారం ఏర్పడుతుందన్నారు. ఆర్థిక భారం తగ్గించడంతో పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు ఆయన చేయాలని బుదవారం  ఓ ప్రకటనలో  డిమాండ్  చేశారు.