ప్రారంభానికి ముస్తాభైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం … శుక్రవారం ప్రారంభించనున్న స్పీకర్

0
41 Views

వికారాబాద్ : వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈ నెల 29న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర స్పీకర్ , వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ దీన్ని ప్రారంభించనున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత వారికి అనువుగా ఉండే విధంగా క్యాంపు కార్యాలయాన్ని అందగా ముస్తాబు చేశారు. పై అంతస్తులో స్పీకర్ ఉండే విధంగా విశ్రాంతి తీసుకునే విధంగా ముస్తాబు చేస్తే కింది భాగంలో ప్రజలను కలిసే విధంగా క్యాబిన్ హాల్ ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టు ప్రహరి గూడ , ప్రజల సౌకర్యార్థం బయట మరుగుదొడ్ల ఏర్పాటు సైతం చేశారు. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు .