మృతురాలి కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

0
16 Views

వికారాబాద్ : మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్ గ్రామంలో బేగరి పద్మమ్మ అనారోగ్యంతో బాధపడుతు ఆదివారం రాత్రి మృతి చెందింది.. గ్రామస్తుల ద్వారా అట్టి విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి  పద్మమ్మ అంత్యక్రియలకు 5 వేల రూపాయలు పంపగా స్థానిక ఎంపీటీసీ స్వప్న సురేష్  సోమవారం గ్రామస్తుల తో కలిసి మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 5 వేల నగదును అందజేశారు.. ఈ కార్యక్రమంలో మోహన్, లాలు, నిరంజన్, రాజు, శ్రీకాంత్, దిలీప్ గ్రామస్తులు పాల్గొన్నారు..