మహిళలకు మంచి రోజులు రాబోతున్నాయి: తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
178 Views

వికారాబాద్: రాష్ట్రంలోని మహిళలకు మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. క్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీ ఖజనా ఖాళీ చేసిందని అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు మంచి రోజులు రాబోతున్నాయని కొంత ఓపిక పట్టాలని కోరారు . మహలక్ష్మి పథకం ద్వారా మహిళకు 2500 లు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు రమేష్ కుమార్, ముత్తహార్ షరీప్ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు