81 Views
వికారాబాద్: జిల్లా లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలోతెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వికారాబాద్ జిల్లాను ఆరంజ్ అలార్ట్ గా ప్రకటించడం జరిగిందని జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీ వర్షాలు వల్ల రోడ్డు కొట్టుకుపోవడం, ఉద్యాన పంటలు నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్త లు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలు అత్యవసర సహాయం కొరకు విపత్తు ల నిర్వహణ సంస్థ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు..