జిల్లాలో మరో విషాదం… బోజనం వికటించి 18 మంది విద్యార్థుల అస్వస్థత

0
42 Views

వికారాబాద్ ( తాండూరు ) : వికారాబాద్ జిల్లాలో వరుసగా పాఠశాలలు, వసతి గృహాల్లో  ఏదో  ఒక సంఘటన చోటు చేసుకుటుంది. నాణ్యత లేని బోజనాలతో పాటు పరిసరాల అపరిశుభ్రతతో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారు . కొత్తగడి సాంఘిక సంక్షేమ పాఠశాలలో గత కొన్ని రోజుల క్రితం విద్యార్థినీలు అస్వస్థకు గురి కాగా తాజాగా వికారాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు  ఆసుపత్రి కాగా నేడు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దముల్ మండలం కందనెల్లి తండా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 18 మంది విద్యార్థులకు వాంతులు చేసుకున్నారు. వారిని మాతా శిశు కేంద్రానికి తరలించి  ఉపాధ్యాయులు చికిత్సలు అందజేస్తున్నారు. 18 మందిలో 13 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి పంపించారు. ఐదుగురు విద్యార్థులు ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు.