డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి .. వికారాబాద్ జిల్లాలో విషాదం

0
45 Views

తాండూరు : డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రం తాండూర్ నందు చోటుచేసుకుంది . తల్లిదండ్రులు తెలిపిన వివరాం ప్రకారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం రేగడి మైలారం గ్రామానికి చెందిన శివకుమార్ కవిత దంపతులు కవిత గర్భవతి ఉండగా శనివారం ఉదయం తాండూర్ లోని మాతా శిశు ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు కవితను పరిశీలించిన అనంతరం నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారు దీంతో కవితకు సాయంత్రం వేళ నొప్పులు బాగా రావడంతో ఆస్పత్రి వైద్యులు పరిశీలించి ఆమెకు సిజరింగ్ చేశారు. సిజరింగ్ చేసిన అనంతరం తల్లి కవితను బయటికి తీసుకురావడం జరిగిందని తండ్రి పేర్కొన్నారు. పుట్టిన బాబు తల్లి ఇద్దరు ఆరోగ్యకరంగా ఉన్నారని డాక్టర్లు తమతో పేర్కొన్నట్లుగా తెలిపాడు.తీరా గంట వ్యవధిలో బాబు చనిపోయినాడు అని డాక్టర్లు కబరు చెప్పారని వాపోయాడు. దీంతో రాత్రి డాక్టర్లతో అడగగా సరియైన సమాధానం ఇవ్వలేదని వాపోయాడు. నేటి ఉదయం తన గ్రామ డాక్టర్లను అడిగేందుకు ఇక్కడికి వచ్చినట్లుగా తెలియజేశాడు. నిరుపేదలకు సరియైన వైద్యం అందటం లేదని ఆరోపించాడు