ఆలయ చరిత్ర భక్తులకు వివరిస్తా… శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి

0
425 Views

వికారాబాద్:  అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని  మంగళవారం ఉదయం ప్రముఖ పురాణ ప్రవక్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు  కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించు కున్నారు.ఆలయ మర్యాదలతో చాగంటి  కి స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించనైనది. స్వామి స్థల పురాణం , ఆలయ విశిష్ట గురించి అర్చకులు వివరించారు.ఇంత మహత్యం గల ఆలయ దర్శన భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని చాగంటి   తెలిపారు.ఇంతటి ఆలయ చరిత్ర గురించి తన పురాణ.. ప్రవచనాల ద్వారా అనంతగిరి ఆలయం గురించి భక్తులకు వివరిస్తానని చాగంటి   తెలిపారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ N. పద్మనాభం  చాగంటి  కి స్వామి వారి శేషవస్త్రం,స్వామి వారి చిత్రపటం ద్వారా సన్మానించారని ఆలయ E O, T. నరేందర్ తెలిపారు.