లోక్ సభ లో బిజెపి విప్ గా చేవెళ్ల ఎం.పి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
224 Views

వికారాబాద్: చేవెళ్ల ఎం.పి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి లోక్ సభలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి లోక్ సభ లో విప్ గా బాధ్యత నిర్వహించే అవకాశం వచ్చింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి లోక్ సభ స్పీకర్ కు పార్టీ తరుపున చీఫ్ విప్ , విప్ లుగా నియమించిన వారి పేర్లను తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి లోక్ సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కూడా ఆ అవకాశం రావడం బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.