141 Views
హైదరాబాద్: అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్ చేశారు. గురువారం BRSV ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడించగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని , వెంటనే ప్రభుత్వం జాబ్ కాలెండర్ విడుదల చేయాలనీ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.