ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి: బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి

0
61 Views

వికారాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమాన పరుస్తూ మాట్లాడడం జరిగిందని వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మను లాగేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అన్ని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదని, రైతు రుణమాఫీ సైతం తూతూ మంత్రంగా చేసిందన్నారు. 2014 కంటే ముందు రుణాలు తీసుకున్న వారికి రుణమాపీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్, రామస్వామి, నాయకులు అనిల్, దేవదాసు, తదితరులు పాల్గొన్నారు