అనంతగిరి డెస్క్ : నటి సమంతతో వివాహం ముగిసి, విడాకులు తీసుకున్న తరువాత, ప్రముఖ నటుడు నాగ చైతన్య, శోబిత ధూళిపాళాతో నిశ్చితార్థం జరిగింది. గురువారం ఉదయం 9:42 గంటలకు జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకకు రెండు కుటుంబాలు హాజరయ్యారు. తమ కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం వార్తను హిరో నాగార్జున ప్రకటించి వారి కుటుంబ సభ్యులు, శోబిత ధూళిపాళాను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకకు దగ్గరి బంధువులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య తన జీవితంలోకి ముందుకు వెళ్లినట్టు ఈ నిశ్చితార్థం సూచిస్తుంది. ఈ నిశ్చితార్థం వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నూతన దంపతులకు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నాగ చైతన్య, శోబిత ధూళిపాళాతో నిశ్చితార్థం
286 Views