సుద్ధ గనులలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం

0
96 Views

అనంతగిరిడెస్క్(పెద్దేముల్): పెద్దేముల్ మండల కేంద్రంలో ఒక సుద్ధ గనులలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో భారీ ఎత్తున చోరీ జరిగిన సంఘటన మరువక ముందే ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది…వివరాలకెళ్తే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్ పూర్ గ్రామ శివారులో ఈ ఉదయం సుద్ధ గనిలో ఒక మృతదేహం కనిపించింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు మృతదేహం అదే మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన బండమీది రమేష్ వయసు 28 సంవత్సరాలు పోలీసులు గుర్తించారు. రమేష్ ముఖం పై గాయాలు ఉండడం సంఘటన స్థలంలో మద్యం సీసాలు ఉండడం పై పలు అనుమానాలు వెళ్ళు వెతుతున్నాయి. నిన్న శుక్రవారం రుద్రారం గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి ఇంట్లో భారీ ఎత్తున బంగారం వెండి చోరీ అయినా సంఘటన జరిగిన విషయం తెలిసిందే అయితే అదే గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో ఆ వ్యక్తికి చోరీకి ఏమన్నా సంబంధం ఉందా? అని కొనంలో పోలీసులు దర్యాప్తు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు దొంగతనంపై అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం.