ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
61 Views

వికారాబాద్: జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలందరు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటన తెలిపారు .
శనివారం జిల్లా లో తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు , మున్సిపల్ కమిషనర్లు అందరు అప్రమత్తం గా ఉండాలని,ఎడతెరపి లేని వర్షాలు, గ్రామాలు, జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయని, రానున్న రెండు మూడు రోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినందున ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పాతబడిన మిద్దెలు ఉండి శిధిలావస్థకు చేరుకొని ఉంటే అలాంటి వాటిని గుర్తించి వెంటనే అందులో నుంచి కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, మురుగు కాలువలు అన్ని శుభ్రం చేయించాలని ఎక్కడ కాలువలు నిండిపోయి ఓవర్ఫ్లో కాకుండా చూసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలువ లేకుండా చూసుకోవాలని, ఈగలు, దోమలు వ్యాప్తి చెంది అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది కాబట్టి పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎక్కడైనా పంట నష్టం జరిగితే వెంటనే నివేదిక సిద్ధం చేసి పంపించెందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్దంగా ఉండాలని తెలిపారు.విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని, పాతబడి కుంగిపోయిన విద్యుత్ స్తంభాలు ఉంటే వెంటనే మార్చాలని, వైర్లు కిందికి వేలాడకుండ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.
ఎక్కడైనా ఏవైనా సమస్య ఉత్పన్నం అయితే వెంటనే సంబంధిత అధికారికి సమాచారం ఇవ్వాలని. కలెక్టరెట్ కార్యాలయం 08416242136 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచార మివ్వాలని సూచించారు.

జిల్లా ఎస్పీ తో కలిసి జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు చేశారు.రానున్న మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని, ముందస్తు గా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.