నెల రోజుల పాటు అన్నదానం చేయడం అభినందనీయం : మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

0
48 Views

వికారాబాద్:  బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో శ్రావణ మాసంలోభాగంగా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నెలరోజులపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజులపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు అభినందించారు. అనంతగిరి, బుగ్గు రామలింగేశ్వర ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని, ఆలయాల అభివృద్దికి, ఇక్కడి అవసరాలకు మా వంతు కృషి చేస్తామని తెలిపారు.