లొంకల సంగమేశ్వర దేవాలయంలో రుద్రాభిషేకం

0
231 Views

వికారాబాద్:వికారాబాద్ మండల పరిధిలోని లొంకల సంగమేశ్వర దేవాలయంలో శ్రావణ మాస చివరి సోమవారం పురస్కరించుకుని రుద్రాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు మద్యాహ్నం రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో మదన్ పల్లి గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని దైవ ప్రసాదాలు స్వీకరించారు.