గిరిజన ఆశ్రమ వసతి పాఠశాల్లో సమస్యలు పరిష్కరించాలి: గిరిజన మోర్చ గోవింద్ నాయక్

0
246 Views

వికారాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారికి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యలు వివరించడానికి జిల్లా గిరిజన మోర్చా ప్రతినిధులు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో విద్యార్థులు కలుషితమైన నీరు తాగి విషజ్వరాల బారిన పడుతున్నారు. అలాగే, పోషకాహారం లేని ఆహారం మరియు మెను ప్రకారం ఆహారం అందించడం లేదని పేర్కొన్నారు. సిబ్బంది లేక కంప్యూటర్లు వాడకంలో లేవని కూడా తెలిపారు.ఈ సందర్బంగా గోవింద్ నాయక్ మాట్లాడుతూ, పై సమస్యలు విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదకరమని, వీటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి హరి నాయక్, సెక్రటరీ శంకర్ నాయక్, మరియు ఎక్సిక్యూటివ్ మెంబర్ రాంచందర్ నాయక్ పాల్గొన్నారు.