23 Views
అమరావతి: దక్షిణ భారత సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దేవర’ సినిమా విడుదలకు ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై రూ.135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్కు రూ.110, లోయర్ క్లాస్ టికెట్కు రూ.60 వరకు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.అదేవిధంగా, సినిమా రిలీజ్ రోజైన సెప్టెంబర్ 27న రాత్రి 12 గంటల నుంచి 6 షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, 28వ తేదీ నుంచి వచ్చే 9 రోజుల పాటు రోజుకు 5 షోలను ప్రదర్శించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.