శాసన మండలి ఎన్నికకు సంబంధించి కొడంగల్ లో వంద శాతం పోలింగ్..ఓటు హక్కు వినియోగించుకున్న మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0
64 Views

కోడంగల్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు సంబంధించి కొడంగల్ లో వంద శాతం పోలింగ్ జరిగింది. కొడంగల్ నియోజకవర్గం లోని దౌల్తాబాద్, బొంరాస్ పేట్, కొడంగల్ మండలాల పరిధిలో 56 మంది ఓటర్లు ఉండగా అందులో ముగ్గురు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, 40 మంది మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు, 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పట్టణ స్థానిక సంస్థల ఎక్స్ ఆఫీషియో సభ్యులైన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు, జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి లు సందర్శించి పరిశీలించారు.