బస్సు కింద పడి స్కూల్ విద్యార్థి మృతి

0
214 Views

అనంతగిరి డెస్క్ : జనగామ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటనలో, స్కూల్ బస్సు దిగుతుండగా బ్యాగు బస్సుకు తట్టుకోవడంతో, బానోతు వరుణ్ వెనుక టైర్ కింద పడిపోయాడు. దురదృష్టవశాత్తు, తలపై నుంచి టైరు వెళ్లడంతో వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ దారుణ సంఘటన స్థానికులను మరియు విద్యార్థి తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని ఆరోపిస్తూ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. విద్యార్థి బంధువులు మరియు స్థానికులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.