వికారాబాద్ జిల్లాలో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటో బోల్తా

0
436 Views

వికారాబాద్ (పరిగి): కుక్క అడ్డురావడంతో స్కూల్ పిల్లలతో వెలుతున్న ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడ్డ సంఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పరిగిలోని టీచర్స్ కాలనీలోని మదర్సా స్కూల్ నుండి బొంరాస్ పేట వెళ్తుండగా పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో స్కూల్ ఆటో బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది విద్యార్థులు ఉండగా ఆటో డ్రైవర్ తో పాటు ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు…..మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు 108 ద్వారా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నడుస్తున్న ఆటోకు ఎదురుగా వీధి కుక్క అడ్డురావడంతో ప్రమాదం జరిగింది.