20 Views
వికారాబాద్: మనం ఎక్కడైనా నీటిలో విన్యాసాలు చేసే వాళ్ళని గజ ఈతగాలను లేదా యువకులను లేదా ఏదైనా పోటీల్లో చూసుంటాం కానీ ఓ పూజారి యోగాసనాలు చేయడం వికారాబాద్ జిల్లా అనంతగిరి పుష్కరిన్ లో కనిపించింది. ఈనెల 8 నుంచి ప్రారంభమైన కార్తీకమాస జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రతీర్థంతో జాతర ముగింపు వేడుకలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయ ధర్మకర్త N. పద్మనాభం గారు పుష్కరిణి యోగాసనాలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.