రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి

0
23 Views

వికారాబాద్: తమతోటి  ఉద్యోగి పెళ్లికి కారులో వెళ్లి వస్తూ  రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండలం పులుపుమామిడి శివారులో ఆదివారం జరిగింది. వికారాబాద్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం .. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కెపల్లి శివారులో కానిస్టేబుల్ పెళ్లికి వికారాబాద్ నుంచి మిత్రులు ఏఆర్ కానిస్టేబుళ్లు అగ్గనూర్ కృష్ణకుమార్(34),
దిలీప్ కుమార్, రాజు, నరేందర్ లు కలిసి కారులో వెళ్లారు. తిరిగి వస్తూ మార్గమధ్యన పులుసుమామిడి సమీపంలోని వంతెన సమీపంలో   మరో వాహనం వేగంగా కారు పైకి దూసుకురాగా, తప్పించే క్రమంలో అదుపు తప్పి వంతెనను ఢీ కొంది. అక్కడికక్కడే కృష్ణకుమార్ మృతి చెందగా, మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మృతునిది బషీరాబాద్ మండలం అల్లాపూర్ స్వగ్రామం కాగా, 2018లో ఏఆర్
కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. మృతునికి భార్య నర్సమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, నాలుగేళ్ల కొడుకు, రెండున్నరేళ్ల కూతురు ఉన్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు.కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి ఓదార్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.