బ్రిలియoట్ గ్రామర్ హై స్కూల్ నందు ఆషాడ మాస బోనాలు

0
207 Views

వికారాబాద్:  బ్రిలియoట్ గ్రామర్ హై స్కూల్ నందు ఆషాడ మాస బోనాలను పురస్కరించుకొని పాఠశాలలందు విద్యార్థులు బోనం చేసి పోచమ్మ దేవాలయానికి వెళ్లి నైవేద్యాన్ని సమర్పించారు.
కార్యక్రమoలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ జయ కాంత్ రెడ్డి  మాట్లాడుతూ ఈ యొక్క బోనాల పండుగ మన తెలంగాణ పండుగలో చాలా విశిష్టమైనదని పేర్కొన్నారు. అంతే కాకుండా వర్షాలు బాగా పడి రైతులకు మంచి పంటలు ఇవ్వాలని ఈ యొక్క బోనాలను గ్రామదేవతలకు సమర్పించడం మన తెలంగాణ ప్రజల ఆనవాయితీ అని ప్రతి గ్రామ గ్రామాన చేసుకోవడం జరుగుతుందని  అన్నారు. పిల్లలు బోనాలు చేసి పోతురాజుల విన్యాసాలతో పాఠశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఎంతో సంతోషదాకమని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇట్లాంటి పండుగలు అన్నీ కూడా సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రభాకర్ గౌడ్ నురేష్ కుమార్, మహేందర్ గౌడ్, శ్రీలక్ష్మి ,రోజా, జ్యోతి ,సుకన్య ,రాధా తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.