15 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం పాట తాత్కాలికంగా వాయిదా: జిల్లా కలెక్టర్ నిఖిల

0
14 Views

వికారాబాద్: ఈనెల 14న (సోమవారం) ఆర్డిఓ కార్యాలయంలో నిర్వహించ తలపెట్టిన రాజీవ్ స్వగృహ ఆలంపల్లి లో గల 15 ఎకరాల స్థలం వేలం పాటను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఆలంపల్లిలో గల 15 ఎకరాల స్థలంలో అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టవలసి ఉన్నందున ఇట్టి వేలం పాటను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. పనులు పూర్తయిన పిదప తదుపరి వేలం తేదీని నిర్ణయించి ప్రకటించడం జరుగుతుందని అన్నారు. అలాగే గంగారం లో గల 3.5 ఎకరాల స్థలానికి ప్రత్యక్ష వేలం యధావిధిగా సోమవారం ఉదయం 11:00 గంటలకు వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి వేలం పాటలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలియజేశారు.