బీసీ కుల గణనకు జరుపాలి: రాష్ట్ర బీసీ సంఘం చైర్మన్‌ గొరిగి మల్లేష్ యాదవ్

0
135 Views

వికారాబాద్: రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీలకు కుల గణన జరగకపోవడం వల్ల వారు అన్యాయానికి గురవుతున్నారని రాష్ట్ర బీసీ సంఘం చైర్మన్‌ గొరిగి మల్లేష్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బీసీ కుల గణన జరపాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కే. యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ. వెంటనే కుల గణన చేపట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ కి ఈ విషయాన్ని విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించి, ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తిని పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం యూత్‌ అధ్యక్షులు నీల వెంకటేష్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పెళ్లి అంజి, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి రవి యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్ శివకుమార్ పాల్గొన్నారు.